గృహహింసపై గళం విప్పిన విరుష్క జోడి

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో  గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది.   దాదాపు నెల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని కొంతవరకూ మెరుగు పరుస్తున్నా,  గృహహింస కూడా అధికమైపోయింది. మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ గృహహింసకు గురవుతున్నామని 239 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళ కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) వెల్లడించడంతో మహిళలను కాపాడేందుకు 50కి పైగా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన్టుల ఎన్‌సీడబ్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ పేర్కొన్నారు. లాక్‌డౌన్ సమయంలో గృహహింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.(మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!)